Monday, February 25, 2008

భూమి గుండ్రం గా ఉంది

వీడేంటి? "భూమి గుండ్రం గా ఉంది" అని కొత్త నిజం చెప్పినట్లు చెపుతున్నాడు? అనుకొకండి. కొన్ని కొన్ని సంఘటనలు మనకి పైన చెప్పిన నిజాన్ని మరలా మరలా గుర్తు చేస్తుంటాయి.

మొన్న గౌరవ పార్లమెంటు సభ్యుడైన ఉండవెల్లి, మన రాజ్యాంగాన్ని, స్వర్గీయ డా!అంబేత్కర్ గారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లు పేపర్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిని టిడిపి ప్రొద్బలం తో అంధ్రజ్యోతి, ఈనాడు రాజకీయం చేసాయని కాంగ్రెస్స్ వాళ్ళు ఆరోపించారు.

నిన్న తల్లి తెలంగాణా అద్యక్షురాలు విజయశాంతి టిడిపి మీద చంద్రబాబు మీద వికలాంగుల సంక్షేమం విషయం లో ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే. దానిని కాంగ్రెస్స్, వైయెస్ ప్రొద్బలం తో విజయశాంతి రాజకీయం చేసిందని టిడిపి వాళ్ళు ఆరోపించారు.

కాంగ్రెస్స్ మీద ఆరోపణలు వస్తే టిడిపి ప్రొద్బలం, టిడిపి మీద ఆరోపణలు వస్తే కాంగ్రెస్స్ ప్రొద్బలం. ఇదేదో "భూమి గుండ్రం గా ఉంది" ని గుర్తుకు తెస్తుంది కదా!!

Tuesday, February 12, 2008

మన తెలుగు బ్లాగుల గురించి ఈనాడు లో

మన తెలుగు బ్లాగుల గురించి ఈనాడు లో వచ్చిన వ్యాసం చూశారా...? చూడాలంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి। http://www.eenadu.net/archives/archive-3-2-2008/htm/weekpanel1.asp లేదా ఈ ఇమేజి చూడండి।

Sunday, February 10, 2008

కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్

ఈ పద్యం విన్నారా...? ఎప్పుడైనా..??

"గంజాయి తాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా
లంజల కొడకా ! యెక్కడ
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం | "

పోనీ ఈ పద్యం...????

"రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయా ! యేమని చెప్పుదు ?
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం |"

ఇవి తెనాలి రామకృష్ణ కవి కధలలో చెప్పెవారు నా చిన్నప్పుడు.

ఒకసారి రామకృష్ణ కవి గారిని ఏవిధంగానూ ఎదుర్కోలేక , చివరికి కాపలా వాళ్ళ చేత అవమానింప చెయ్యాలని అనుకొన్నారు మిగతా కవులు. మిగతాకవులిచ్చే లంచాలకి ఆశపడి కాపలా వాళ్ళు కవులిచ్హే సమస్యని రామకృష్ణ కవి గారి ముందు ఉంచటానికి సిద్దపడ్డారు. సమస్య ఎమిటంటే "కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్".(అంటే ఏనుగుల గుంపు వెళ్ళి దొమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం). దీనిని కవి గారి ముందు సమస్యా పూరణం కోసం ఉంచారు భటులు. రామకృష్ణ కవి గారికి విషయం అర్థమయ్యింది. అందుకని మొదటి పద్యాన్ని వదిలారు....

దాని అర్థం భటులకి బోధపడెలోగా కవిగారు భువనవిజయం వైపు అడుగులు వేసారు. రాయల వారికి ఈ విషయం తెలిసింది. సరే రామకృష్ణులవారి చతురత ఏమిటో చూద్దామని మరల అదే సమస్యనిచ్చారు రాయలవారు. ఈ సారి అడిగింది రాయలవారు, మరలా అదే సమాధానం చెపితే దండన తప్పదని మురిసిపొతున్నారు మిగతా కవులు. కాని రామకృష్ణులవారి చతురత తెలిసిందె కదా! సభలొ ఈ రెండో పద్యం వదిలారు. ఎవ్వరికీ నోటమాట రాలెదు. రాయలవారు స్వయంగా కవిగారిని ఆలింగనం చేసుకొని, రామకృష్ణా "నీ కత్తికి రెండువైపులా పదునే" అని ప్రసంసించారట.

మొదటి పద్య భావం అర్థమయి ఉంటుంది. రెండవపద్య భావం: " (మహాభారతం లోని పాండవులని ఏనుగులతో పొల్చారు). మహా బలవంతులు అయిన పాండవులు, కౌరవుల జూదం లో ఒడిపొయి, ఒక చిన్న సామంత రాజయిన విరాట రాజు (విరాట రాజుని దొమతో పోల్చారు) కొలువు లో అజ్ఞాతవాస సమయం లో పనిచెయ్యవలసి వచ్హింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్ళి దోమ గొంతులో కూర్చొవటం కాక మరేమిటి? "/

Saturday, February 9, 2008

నువ్వు నువ్వు నువ్వే

నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నాచుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవి పైనా నువ్వు
నా మెడ వంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు
వొళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు, మొగ్గల్లే నువ్వు, ముద్దేసే నువ్వు...
నిద్దర్లో నువ్వు, పొద్దుల్లో నువ్వు, ప్రతి నిమిషం నువ్వూ...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు

ఎంటి వీడికేమీ పిచ్చి పట్టలేదుకదా అనుకొకండి. ఎమీ లేదండీ... నిన్న ఎదో ఊసుబోని కబుర్లలో... ఈ పాట ప్రస్థావనకు వచ్చింది. మన సిరివెన్నెల ఎంత బాగా రాసాడొ కదా! అనుకొన్నాం. నేను రచించక పోయినా.. ఒక్క సారి తెలుగులొ వ్రాస్తే ఎలా ఉంటుందొ అని ప్రయత్నించాను. అదీ సంగతి.

Friday, February 8, 2008

చర్చిల్ - ఫూల్సు

ఒక సారి చర్చిల్ బ్రిటన్ పార్లమెంటులో ఆవేశంగా ప్రసంగిస్తూ "నిజం చెప్పలంటే ఈ పార్లమెంటులో సగం మంది ఫూల్సే..." అన్నాడట.. ఇంకేముంది! పెద్దగొడవ మొదలయింది. సభ దద్దరిల్లింది. చర్చిల్ తన మాటలు ఉపసం హరించుకొవాలని,సభకు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అలాగేనంటూ చర్చిల్ లేచి, "అయ్ యాం వెరీ సారీ! నిజంగా ఈ పార్లమెంటులో సగం మంది ఫూల్సు కాదు." అన్నాడట.